ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - విద్యుదాఘాతంతో తూర్పుగోదావరి జిల్లాలో మృతుల వార్తలు

అలసట చెంది వచ్చిన భర్త ఆదమరచి నిద్రిస్తుంటే... గాలేయటం లేదేమోనని ప్రేమతో భార్య ఫ్యాన్ వేసింది. విధి వాళ్లపై కన్నెర్ర చేసింది. ఈ ప్రేమ ఎంతో సేపు నిలవనీయలేదు. ఆ ఫ్యాన్​కు విద్యుత్ ప్రవహించి భర్త చనిపోయాడు. అప్పుడు ఆవిడకు తెలియలేదేమో... ఆ ఫ్యానే తన జీవిత భాగస్వామి పాలిట యమపాశం అవుతుందని. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా చెముడు లంకలో జరిగింది.

man died with electric shock
చెముడు లంకలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

By

Published : Jun 3, 2020, 7:47 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడు లంకలో విషాదం అలుముకుంది.పొగాకు వ్యాపారం చేసుకుంటున్న వెంకట సూర్యనారాయణ మూర్తి(వీఎస్ మూర్తి) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎప్పటిలాగానే వీఎస్ మూర్తి దుకాణాలకు పొగాకు వేసి వచ్చి పడుకున్నాడు. అలసట చెంది వచ్చాడు కదా అని... సమీపంలోని టేబుల్ ఫ్యాన్ భార్య కల్యాణి వేయాలనుకుంది. అతనికి తగిలేటట్టు తిప్పడానికి ప్రయత్నించగా...విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న వీఎస్ మూర్తి...ఫ్యాన్ పట్టుకొని భార్యను పక్కకు నెట్టే ప్రయత్నం చేశాడు. ఆయనకు కూడా షాక్ కొట్టింది. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆసుపత్రికి తరలించగా మూర్తి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సృహలోకి వచ్చిన భార్య కల్యాణి... రెండేళ్లు, నాలుగేళ్ల బిడ్డల్ని పట్టుకొని భర్త కోసం విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించిం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details