తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉదయం ఆరుగంటలకే అన్ని దుకాణాలు తెరిచారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరుచుకుని వ్యాపారం చేసుకోవాలని, అనంతరం మూసి వేయాలని నిర్ణయించారు. మంగళవారం నుంచే ఈ నిబంధనలకు అమల్లోకి వచ్చాయి.
ఆరుగంటలకే తెరుచుకున్న దుకాణాలు...
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లాక్డౌన్ నిబంధనలకున అనుగుణంగా దుకాణాలను ఉదయం ఆరు గంటలకే తెరిచారు. ఆర్డీవో ఆదేశాల మేరకు వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 11 గంటలకు మూసివేస్తున్నారు.
lockdown rules are following in east godavari dst konasima