ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 22, 2020, 2:06 PM IST

ETV Bharat / state

కాకినాడలో నెహ్రూ విగ్రహం కూల్చివేతపై నిరసన

సీఎం జగన్ పుట్టినరోజు నాడు మహనీయుల విగ్రహాలు కూల్చడమే ప్రభుత్వ విధానమా అని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు ప్రశ్నించారు. కాకినాడలో నెహ్రూ విగ్రహం తొలగించటంపై స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా నగరపాలక సంస్థ సిబ్బంది ఈ విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు.

protested for the removal of the Nehru statue
కాకినాడలో నెహ్రూ విగ్రహం కూల్చటం పై నిరసన

సీఎం జగన్ పుట్టిన రోజున మహనీయుల విగ్రహాలు కూల్చటం ఏమిటని... సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నెహ్రూ విగ్రహం తొలగించటంపై స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. 1974లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details