ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొక్కలు, పూల అందాలతో 2020కి ఘన స్వాగతం - New Year 2020 with one laksha Plants and flowers at kadiyam Nursery

విశాఖలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజా ప్రతినిధులకు అధికారులు, ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మొక్కలు, పూలతో 2020 రూపంలో ఏర్పాటు చేశారు. కడియంలోని నర్సరీలో లక్ష మొక్కలను ఒకేచోట తీర్చిదిద్దిన వైనం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

leaders and people welcome to New Year 2020
తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల్లోని మొక్కలతో స్వాగతం

By

Published : Jan 1, 2020, 9:29 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి దంపతులు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​కి అధికారులు ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

విశాఖలో నూతన సంవత్సర వేడుకలు

ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావుకి పలువురు అధికారులు తెదేపా నాయకులు కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లోని మొక్కలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికాయి. మొక్కల్ని అన్నింటినీ ఒకేచోట 2020 సంవత్సరం ఆకృతిలో అమర్చారు. కడియంలోని పల్లా వెంకన్న నర్సరీలో ఏడు రోజులు శ్రమించి లక్ష మొక్కలను ఒకే చోటకు చేర్చి... 2020 ఆకృతిని ఏర్పాటు చేయడంతో పాటు... పూలతో కూడా ఇదేవిధంగా రూపొందించారు. నర్సరీకి వచ్చే సందర్శకులను ఈ ఆకృతులు విశేషంగా ఆకట్టుకున్నాయి.

మొక్కలు, పూల అందాలతో 2020కి ఘన స్వాగతం

ఇవీ చూడండి...

వ్యవసాయ శాఖ అధ్వర్యంలో ముగ్గుల పోటీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details