ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోవిడ్-19 నివారణకు జిల్లాలో ప్రత్యేక బృందం

By

Published : Mar 18, 2020, 11:30 PM IST

కరోనా వైరస్‌ నివారణ చర్యలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీస్‌ శాఖ 22 మంది సభ్యులతో రెండు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అద్నాం నయీం అస్మీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఈ టాస్క్‌ఫోర్సు బృందాలు సహకారం అందించనున్నాయి.

kovid-19 precautions in east godavari dst
కోవిడ్-19 నివరాణకు జిల్లాలో ప్రత్యేక బృందం

కోవిడ్-19 నివరాణకు జిల్లాలో ప్రత్యేక బృందం

కోవిడ్-19ను నివారించేందుకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చే వారిని గుర్తించి వైరస్‌ నివారణ పరీక్షలు చేయడానికి, వైద్య ఆరోగ్య శాఖతో పాటు పని చేస్తాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాం నయిం అస్మీ తెలిపారు. కరోనా వైరస్​పై తీసుకోవల్సిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను ఎస్పీ విడుదల చేశారు. టాస్క్‌ఫోర్స్​ సభ్యులకు రక్షణ దుస్తులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ హారీఫ్‌, ఏఎస్పీ కరణం కుమార్‌, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details