ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 11, 2019, 5:40 PM IST

ETV Bharat / state

కడియంలో క్రిస్మస్‌.. కొత్త సంవత్సర సందడి

క్రిస్మస్‌, నూతన సంవత్సర సందడి మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల్లో ప్రత్యేక మొక్కలు దర్శనమిస్తున్నాయి. కొత్తదనం కోరుకునే వారి కోసం దేశ, విదేశీ రకం పుష్పాలు, మొక్కలు ఇక్కడ ఉంచారు.

kadipilanka-in-east-godavari-district
kadipilanka-in-east-godavari-district

తూర్పుగోదావరి జిల్లా... రాజమహేంద్రవరం సమీపంలోని కడియం వద్దకు చేరుకోగానే.. తాజా పూల పరిమళం గుబాళిస్తుంది. రోడ్డుకు ఎటువైపు చూసినా.. పచ్చని మొక్కలు, రంగురంగుల పుష్పాలతో నిండిన నర్సరీలు దర్శనమిస్తాయి. ఇప్పుడు ఈ నర్సరీలు... క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల కోసం మరింత అందంగా తయారవుతున్నాయి.

దేశవిదేశీ జాతుల పుష్పాలతో నిండిపోయాయి. పండగల్ని దృష్టిలో పెట్టుకుని... వర్బినా, నికోటినా, ప్లాక్స్, డయాంతస్తో, ఫెటోనియా లాంటి అనేక మొక్కలను... నిర్వాహకులు పెంచుతున్నారు. బహుమతులుగా ఇచ్చేందుకు, ఇళ్లలో అలంకరించుకునేందుకు... ఈ రకం మొక్కలు బాగుంటాయని అంటున్నారు సందర్శకులు.

సీజనల్ పూలు, అలంకరణ మొక్కల విత్తనాలు.. విదేశాల నుంచి తీసుకొచ్చి పెంచుతున్నామని నర్సరీ నిర్వహకులు చెబుతున్నారు. నర్సరీల్లో ఇప్పుడు కొనుగోళ్లూ పెరిగాయి.

కడియంలో క్రిస్మస్‌, కొత్త సంవత్సర సందడి

ఇవి కూడా చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్​ఆర్ అగ్రిల్యాబ్స్... ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details