తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో గ్రామ దేవతగా కొలిచే నేరేళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సావాలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా వైదిక కార్యక్రమాలను అతి కొద్దిమంది వైదిక బృందంతో ఆలయంలోనే నిర్వహించారు. గరగల సంబరం ఆలయంలోనే జరిగింది. అధికారులు భక్తులు ఎవర్నీ అనుమతించలేదు.