ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు: లోకేశ్​ - సామర్లకోటలో పొట్టి శ్రీరాములు మరియు ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ

చెత్తపై పన్ను వేసి అసలే కష్టాల్లో ఉన్న ప్రజలపై మరింత భారం మోపుతున్నారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌​ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను​ ఆవిష్కరించారు.

Nara Lokesh
నెల్లూరులో ఎన్టీఆర్ విగ్రహాలు ఆవిష్కరణ

By

Published : Jul 27, 2021, 8:13 PM IST

రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదని.. ముఖ్యమంత్రి జగన్​ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని తెదేపా జాతీయ ప్రాధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం.. చెత్తపై పన్ను వేసి ప్రజలపై ఇంకా భారం మోపుతోందని లోకేశ్​ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మఠం సెంటర్‌లో నిర్వహించిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్​.. స్థానిక పార్టీ నేతలతో కలిసి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.

కొందరు అధికారులు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారన్న లోకేశ్.. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో కలిపి బదులిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details