పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ రాష్ట్ర సమితి నేతలు కోరారు. రాజమండ్రిలో మాదిగల సమావేశం నిర్వహింఛారు.ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ, పార్లమెంట్లో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమూర్తి చిన్న మాదిగ అన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వము నెరవేర్చాలని తెలిపారు. మాదిగ కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో మాదిగలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ల కోసం మాదిగల డిమాండ్ - మాదిగ రాష్ట్రసమితి
మాదిగ జాతి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ రాజమండ్రిలో మాదిగ రాష్ట్ర సమితి నేతలు డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లు చెపుతున్న ఆకుమూర్తి చిన్న మాదిగ