తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి నది పాయపై రూ 49. 50 కోట్ల నిధులతో రెండు వరుసల వంతెన నిర్మాణానికి ఫిబ్రవరిలో టెండర్లు పిలవనున్నట్లు పంచాయతీరాజ్ డీఈఈ రాంబాబు తెలిపారు. పి.గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక వద్ద చేపట్టే ఈ నిర్మాణం పూర్తైతే గోదావరి మధ్యలో గల ఊడిమూడి లంక, బూరుగు లంక, జీ .పెదపూడి లంక, అరిగెలవారిపేట లంక గ్రామాల ప్రజలు కష్టాలు తీరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వశిష్ట గోదావరి మీద వంతెన నిర్మాణానికి త్వరలో టెండర్లు ! - వశిష్ట గోదావరి పాయపై రూ 49. 50 కోట్లతో వంతెన
తూర్పుగోదావరి జిల్లా ఊడిమూడి లంక వద్ద రూ 49. 50 కోట్ల నిధులతో వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు పంచాయతీరాజ్ డీఈఈ అన్నెం రాంబాబు తెలిపారు. వశిష్ట గోదావరిపై ఈ వంతెన పూర్తైతే నాలుగు లంక గ్రామాల ప్రజల అవస్థలు తీరనున్నాయి.
![వశిష్ట గోదావరి మీద వంతెన నిర్మాణానికి త్వరలో టెండర్లు ! in February Tenders for bridge on Vashishta Godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10341718-233-10341718-1611327047785.jpg)
వశిష్ట గోదావరి మీద వంతెన నిర్మాణానికి త్వరలో టెండర్లు
'వంతెన నిర్మాణానికి 9ఏళ్లు కింద పీఎంజీఎస్వై నిధులు రూ.19 .20 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులు సరిపోకపోవడం వల్ల 2018లో అప్పటి ప్రభుత్వం రూ. 49.50 కోట్ల మంజూరు చేసింది. కానీ అప్పుడు టెండర్ దశకు వెళ్లలేదు. ఇప్పుడు టెండర్ దశకు చేరుకుంది. టెండర్లు ఖరారైతే ఈ ఏడాది వరదల సీజన్లోపు పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది' అని డీఈఈ రాంబాబు వివరించారు.
ఇదీ చూడండి:వింతవ్యాధి బాధితులను పరామర్శించిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్