ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. మూడున్నర లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత

రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎక్సైజ్​శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడున్నర లక్షల రూపాయల విలువ చేసే మద్యం సీసాలను పట్టుకున్నారు.

By

Published : Feb 19, 2021, 9:03 PM IST

Illegal liquor confiscation in Mummadivaram, East Godavari district
మూడున్నర లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత

పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారి వద్ద స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో యానాం నుంచి అమలాపురానికి.. మినీ వ్యాన్​లో తరలిస్తున్న అక్రమ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.

వీటి విలువ సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్​ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్​ను​ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మద్యం సీసాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా

ABOUT THE AUTHOR

...view details