ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహేతర సంబంధం ప్రాణం తీసింది - east godavari district latest murder case

మారేడుమిల్లి మండలంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు కత్తుల సోమిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా సోమిరెడ్డిని అతని బంధువు సూర్యనారాయణరెడ్డి హత్య చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

illegal contact leads to death of her husband in east godavari district
హత్య చేయబడ్డ కత్తుల సోమిరెడ్డి

By

Published : Jun 25, 2020, 6:25 AM IST

వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరు గ్రామంలో జరిగింది. కత్తుల సోమిరెడ్డి (35) భార్యతో... వారి బంధువు కత్తుల సూర్యనారాయణ రెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సోమిరెడ్డి... సూర్యనారాయణ రెడ్డిని పలుమార్లు హెచ్చరించాడు. బుధవారం వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో సోమిరెడ్డిని కత్తితో హతమార్చినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details