ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HEAVY FLOOD: కాజ్​వే పై వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం - floods in east godavari district

గోదావరి నదికి వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. ముంపు గ్రామాల వాసులకు కష్టాలు తప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లా చాకలిపాలెం వద్ద కాజ్​వే పైనుంచి వరద ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కాజ్​వే పై నుంచి వరద
కాజ్​వే పై నుంచి వరదకాజ్​వే పై నుంచి వరద

By

Published : Sep 13, 2021, 12:47 PM IST

కాజ్​వే పై నుంచి వరద

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని చాకలిపాలెం వద్ద కాజ్​వేపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆరు రోజుల నుంచి వరద తగ్గకపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్​వేను ఎత్తుగా నిర్మించాలని కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని.. ఫలితంగా తమకు ఈ అవస్థ తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వశిష్ట, వైనతేయ, గోదావరి నది పాయలో ఇప్పటికీ వరద కొనసాగుతూనే ఉంది.

ABOUT THE AUTHOR

...view details