ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2021, 8:13 PM IST

ETV Bharat / state

'బలవంతంగా పట్టాలిచ్చారు.. అవి మాకొద్దు'

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలపాడులో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసింది. కాలువ సమీపంలో ఉన్న ఆ స్థలాలు వద్దంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

house patta victims
'బలవంతంగా పట్టాలిచ్చారు.. అవి మాకొద్దు'

తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడులో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు వద్దంటూ మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలవరం కాలువ దగ్గరలో కేటాయించిన స్థలాలు వద్దని 6 నెలలుగా చెబుతున్నా.. బలవంతంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి జనసేన నాయకులు పాఠంశెట్టి సూర్యచంద్ర మద్దతు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details