ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడి చికిత్స కోసం దాచిన డబ్బులు.. అగ్నికి ఆహుతి! - భద్రవరంలో ఇల్లు దగ్ధం తాజా వార్తలు

కుమారుడి ఆరోగ్యం బాగా లేదని ఆసుపత్రికి తీసుకెళ్లింది ఆ తల్లి. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి దురదృష్టవశాత్తు ఇల్లు కాలి బూడిదైపోయింది. తన చిన్నారి శస్త్రచికిత్స కోసం దాచిపెట్టిన సొమ్మంతా అగ్నికి అహుతైంది. ఇప్పుడెలా వైద్యం చేయించాలని ఆ తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరంలో జరిగింది.

House burnt   in Bhadravaram
భద్రవరంలో ఇల్లు దగ్ధం

By

Published : Mar 17, 2021, 10:00 AM IST

తనయుడికి గుండె శస్త్రచికిత్స కోసం దాచుకున్న లక్షలాది రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయంటూ.. తల్లిదండ్రులు పడుతున్న వేదన.. వర్ణనాతీతంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామానికి చెందిన చిన్న రాజు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో.. రెండో కుమారుడు శివ రామకృష్ణకు పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉన్నాయి. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు ఆ దంపతులు. కష్టమైనా... లక్షలాది రూపాయలు వెచ్చించి కుమారుడుకి ఒకసారి శస్త్రచికిత్స చేయించారు.

మళ్లీ శివ రామకృష్ణ నీరసించిపోయిన కారణంగా పరీక్షించిన వైద్యులు.. మరో శస్త్రచికిత్స అవసరం అన్నారు. వ్యవసాయ కూలీ అయిన చిన్న రాజు.. తన కుమారుడి కోసం కష్టించి మరీ.. నాలుగు లక్షలు రూపాయలు కూడబెట్టాడు. మరోసారి కుమారుడికి అపరేషన్ చేయించేందుకు సిద్ధమయ్యాడు. దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో ఇల్లంతా కాలిపోయింది. కుమారుడి వైద్యం కోసం దాచుకున్న డబ్బు అగ్నికి ఆహుతి అయ్యింది. ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ఆ దంపతులు కోరుకుంటున్నారు. తమ కుమారుడిని రక్షించాలంటూ వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details