ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 15, 2019, 10:27 PM IST

Updated : Sep 16, 2019, 1:33 AM IST

ETV Bharat / state

పడవ ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు: హోంమంత్రి

గోదావరిలో పడవ బోల్తాపై హోంమంత్రి సుచరిత మాట్లాడారు. సహాయ చర్యలు ముమ్మరం చేశామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం :హోంమంత్రి సుచరిత

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం :హోంమంత్రి సుచరిత

గోదావరి పడవ బోల్తాపై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపు చర్యలకు పంపించామని తెలిపారు. అదనంగా ఇంకో ఎన్డీఆర్​ఎఫ్​, ఐదు అగ్ని మాపక బృందాలు చేరుకున్నాయన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు ఆదేశించామన్నారు. చీకటిలో వెతుకులాటకు నావికా దళం నుంచి గజ ఈతగాళ్లను రప్పించామని... గాలింపు చర్యలకు కావాల్సిన అన్ని పరికరాలను అందించామని వెల్లడించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకంటామని స్పష్టం చేశారు.

Last Updated : Sep 16, 2019, 1:33 AM IST

ABOUT THE AUTHOR

...view details