ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Local body Elections: ఎస్​ఈసీ రీ పోలింగ్ నోటిఫికేషన్ సస్పెండ్ చేసిన హైకోర్టు - రీ పోలింగ్ నోటిఫికేషన్ సస్పెండ్ చేసిన హైకోర్టు వార్తలు

తూర్పుగోదావరి జిల్లా పులిమేరు ఎంపీటీసీ స్థానానికి గానూ 24, 25, 26 బూతుల్లో రీపోలింగ్ (Re-polling) నిర్వహించాలన్న ఎస్ఈసీ (SEC) నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ముందు 25వ బూతుకు రీపోలింగ్ డిక్లేర్ చేసి.. ఇప్పుడు 24, 25, 26 బూతులలో కొత్తగా ఎన్నికలు పెట్టడం ఏంటని ఎస్​ఈసీని ప్రశ్నించింది. తాజాగా ఎస్​ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్​ను హైకోర్టు సస్పెండ్ చేసింది.

ఎస్​ఈసీ రీ పోలింగ్ నోటిఫికేషన్ సస్పెండ్ చేసిన హైకోర్టు
ఎస్​ఈసీ రీ పోలింగ్ నోటిఫికేషన్ సస్పెండ్ చేసిన హైకోర్టు

By

Published : Nov 11, 2021, 7:49 PM IST

స్థానిక సంస్థల (Local Body elections) ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పులిమేరు 24, 25, 26 బూతులలో రీపోలింగ్ (Re-polling) నిర్వహించాలన్న ఎస్ఈసీ (SEC) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన అభ్యర్థి హైకోర్టులో వ్యాజ్యం (Pill in High Court) దాఖలు చేశారు. వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఎస్​ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్​ను సస్పెండ్ (suspend) చేసింది. పులిమేరు ఎంపీటీసీ (MPTC) 25వ బూతులో కొన్ని ఓట్లు చెదలు పట్టడంతో రీ పోలింగ్ నిర్వహించాలని గతంలో ఎస్​ఈసీ నిర్ణయం తీసుకుందని పిటిషనర్​ తరపు న్యాయవాది ప్రతాప్ వాదనలు వినిపించారు. అయితే.. 25వ బూత్​తో పాటు 24, 26 బూతులలో ఎన్నికలు నిర్వహించాలని తాజాగా ఎస్​ఈసీ రెండో సారి నిర్ణయం తీసుకుందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కౌంటింగ్ సమయంలో జనసేన అభ్యర్థికి 100 ఓట్ల మెజార్టీ వచ్చిందని న్యాయవాది వాదించారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. ముందు 25వ బూతుకు రీపోలింగ్ డిక్లేర్ చేసి ఇప్పుడు 24, 25, 26 బూతులలో కొత్తగా ఎన్నికలు పెట్టడం ఏంటని ఎస్​ఈసీని ప్రశ్నించింది. తాజాగా ఎస్​ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్​ను హైకోర్టు సస్పెండ్ చేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details