ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎండల ప్రభావం... నిర్మానుష్యంగా రాజమహేంద్రవరం - తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 10 దాటిన తరువాత జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు.

నిర్మానుష్యంగా మారిన రాజమహేంద్రవరం

By

Published : May 5, 2019, 9:50 AM IST

నిర్మానుష్యంగా మారిన రాజమహేంద్రవరం

తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. చింతూరు, కిర్లంపూడి, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా.. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనులుంటే తలకు, ముఖానికి రక్షణగా వస్త్రాలు ధరించి ప్రయాణం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రాజమహేంద్రవరం కోటగుమ్మం, పుష్కరఘాట్‌, గట్టురోడ్డు ఎండల ప్రభావంతో ఖాళీగా మారుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details