ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంటింటి సర్వే చేయండి.. బాధితులను గుర్తించండి' - కరోనా కట్టడిపై ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

అన్ని జిల్లాల అధికారులతో కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్​ భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించాలని ఆదేశించారు.

health department helds video conference in prevention measures of corona virus
వైద్యాధికారులతో కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

By

Published : Apr 7, 2020, 7:18 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటికి వెళ్లి పకడ్బందీగా సర్వే నిర్వహించాలని... కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్​ భాస్కర్ సిబ్బందిని ఆదేశించారు. కరోనా నివారణ కోసం ఆయన అమరావతి నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే నిర్వహించిన అనంతరం.. జలుబు, జ్వరం, దగ్గు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి వివరాలను ఉన్నతాధికారులకు చేరవేయాలని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని వైద్య సిబ్బంది... తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కేంద్రానికి వద్దకు వెళ్లి కమిషనర్ చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details