తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో శ్రీ లొల్లాలమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. విచిత్ర వేషధారణ, డప్పు వాయిద్యాలు, బాణసంచా నడుమ అమ్మవారి ఊరేగించారు. అమ్మవారి గరగలను తలపై పెట్టుకొని చేసిన గరగ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఘనంగా 'శ్రీ లొల్లాలమ్మ తల్లి జాతర' - తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వార్తలు
శ్రీ లొల్లాలమ్మ తల్లి జాతర మహోత్సవం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఘటాలను తలకెత్తుకొని చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతర చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఆత్రేయపురంలో శ్రీ లొల్లాలమ్మ తల్లి జాతర