ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా గౌరీ శంకరుల వార్షిక ఉత్సవాలు

గౌరీ శంకరుల 86వ వార్షికోత్సవాలు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా...నెలరోజులపాటు సాంఘిక, పౌరణిక నాటకాలను ప్రదర్శించనున్నారు.

By

Published : Nov 14, 2020, 6:25 PM IST

Updated : Nov 14, 2020, 7:22 PM IST

వైభవంగా గౌరీ శంకరుల వార్షిక ఉత్సవాలు
వైభవంగా గౌరీ శంకరుల వార్షిక ఉత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైభవంగా గౌరీ శంకరుల 86వ వార్షిక ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఏటా అట్లతద్ది నుంచి సంక్రాంతి వరకు ఈ గ్రామంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెల రోజులపాటు గౌరమ్మ వేషాలు ప్రజారంజకంగా ఆకట్టుకునే విధంగా ఆలోచించే రీతిలో నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సాంఘిక పౌరాణిక నాటకాల్లోని ఘట్టాలను కళారూపంగా మలిచి గ్రామంలో ప్రదర్శన ఇస్తున్నారు.

ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఏదో వేషం వేసి కళాకారుడు కావడం పరిపాటి. సీతారామ వనవాసం, మాయలేడి, తాటక వధ, రామాంజనేయ యుద్ధం, చాకలి తిప్పడు, సత్యహరిశ్చంద్రలో పలు సన్నివేశాలతో ఈ నెలరోజులు ప్రదర్శనలిస్తారు. ఇదే క్రమంలో మంగళవారం ధర్మవరం కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారం నాటకంలోని సన్నివేశం విశేషంగా ఆకట్టుకుంది.

Last Updated : Nov 14, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details