అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు : ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి - government's goal is to provide housing newsupdates
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని...తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట మండలాలకు సంబంధించి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గృహనిర్మాణ శాఖ అధికారులతో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పరిశీలించారు. 25 నుంచి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హిజ్రాలకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం, రెండు కేజీలు శనగలను ఎమ్మెల్యే అందించారు.