తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే - ఎర్రచందనం పట్టివేత ముగ్గురి అరెస్టు
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఊరూ వాడా ముంచేసింది. తీరమంతా ముంపులోనే కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం జలదిగ్భందంలోనే మగ్గిపోతోంది. కోనసీమ లంకగ్రామాల్లోకి వరదనీరు చేరుకుంది. పంట పొలాలన్నీ ముంపు బారినపడ్డాయి
![తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4042296-353-4042296-1564962345539.jpg)
తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే!
తీరాన్ని గోదావరి వరద అతలాకుతలం చేస్తోంది. లోతట్టు ప్రాంతాలనంతా ముంచేసింది. ఈ సీజన్లోనే గరిష్ట వరద రాజమహేంద్రవరానికి తాకింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి గరిష్ట వరద 13.50 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. కాటన్ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దేవీపట్నం మండలం ఐదొవ రోజు ముంపులోనే మగ్గిపోతోంది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చినా మిగతావారు వరదనీటిలోనే మగ్గిపోతున్నారు.
తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే!