ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 15, 2021, 7:06 PM IST

ETV Bharat / state

FARMERS: 'కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా.. కేసులా?'

రబీ ధాన్యం డబ్బుల కోసం అమలాపురంలో ఆందోళన చేపట్టిన రైతుల్లో కొంతమందిని పి. గన్నవరం పోలీస్​స్టేషన్​కు తరలించారు. అక్కడ వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు.

ఆందోళనలో పాల్గొన్న రైతులు
ఆందోళనలో పాల్గొన్న రైతులు

రబీ ధాన్యం డబ్బుల కోసం అమలాపురంలో ఆందోళన చేపట్టిన రైతుల్లో కొంత మందిని అరెస్టు చేసి పి. గన్నవరం పోలీస్ స్టేషన్​కు తరలించారు. అక్కడ వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడమే కాకుండా.. న్యాయం కోరిన రైతులపై కేసులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన నాయకులు వారికి మద్దతుగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details