ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పకోడి బండి వివాదంలో.. హత్యకు గురైన బాలుడి అంత్యక్రియలు పూర్తి - పకోడి బండి వద్ద హత్యకు గురైన బాలుడు మృతి వార్తలు

రెండు రోజుల కిందట పకోడి బండి వద్ద జరిగిన వివాదం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న విషయం తెలిసిందే. హత్యకు గురైన బాలుడు శివ అంత్యక్రియలు అతని స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో నిర్వహించారు.

funeral to who was killed at pakodi vehicle in east godavari
funeral to who was killed at pakodi vehicle in east godavari

By

Published : Mar 30, 2021, 8:52 PM IST

పకోడి బండి వద్ద వివాదంతో హత్యగు గురైన బాలుడు శివ అంత్యక్రియలు వీరవరంలో జరిగాయి. పోలీసుల భద్రత మధ్యఅంతిమ యాత్ర కొనసాగింది. నిందితుడు వీరబాబుని ఉరితీయాలి అని గ్రామస్థులు అంత్యక్రియల్లో నినాదాలు చేశారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్​ కుంభ రవిబాబు.. బుధవారం పరామర్శించునున్నారు.

ఏం జరిగిందంటే...?

రెండు రోజుల కిందట వీరవరం గ్రామంలో మాంసం పకోడీ బండి వద్ద వ్యాపారి శింగం ఏసు.. కొవ్వూరి వీరబాబు అనే ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకొంది. మద్యం తాగి ఉన్న వీరబాబు తన స్కార్పియోతో పకోడీ బండిని ఢీకొట్టాడు. బండి వద్ద ఉన్న తండ్రి ఏసు, కుమారుడు శివకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత బాలుడు శివ తలపై వీరబాబు ఇనుప రాడ్‌తో కొట్టాడు. శివను కాకినాడ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అర్ధరాత్రి సమయంలో పరిస్థితి విషమించి మృతి బాలుడు చెందాడు. పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ఆ జైలులోని 43మంది మహిళా ఖైదీలకు కరోనా

ABOUT THE AUTHOR

...view details