ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉగ్రగోదావరి: పంట మునిగింది..ఊరు నిండింది..మనసు భారమైంది..! - floots

గోదావరి పోటెత్తుతోంది..పంట పొలాలు మునిగిపోతున్నాయి...లంక గ్రామాల్నీ వరద ముంచెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఉగ్రగోదావరి:

By

Published : Aug 4, 2019, 10:33 AM IST

నీట మునిగిన 20 లంక గ్రామాలు..!
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. కోనసీమలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కొత్తపేట నియోజకవర్గంలోని ఆలుమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లోని పలుగ్రామాల్లో వ్యవసాయ భూములు వరదనీరుతో నిండాయి. లంక గ్రామాల పరిస్థితి దయనీయంగా తయారైంది. సుమారు 20 ఊళ్లను వరద ముంచెత్తింది. ప్రజలంతా నివాసాలు వదిలి..భారమైన మనసుతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.



ABOUT THE AUTHOR

...view details