ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో జలకళ... గోదావరి నది పాయల్లో ప్రవహిస్తున్న వరద నీరు

కోనసీమలో గోదావరి నది పాయల్లో వరద నీరు నిండుగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు వల్ల ధవళేశ్వరం బ్యారేజీ నుంచి అధికారులు దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు.

By

Published : Aug 13, 2020, 11:16 AM IST

flood coming to dhavaleswaram barrage is high in east godavari district
ఫూటుగా ప్రవహిస్తున్న వరదనీరు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్​కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు దిగువనున్న సముద్రంలోకి నీటిని విడిచి పెడుతున్నారు. ఈ నెల 12న ఉదయం నీటిని దిగుకు వదిలిన అధికారులు తాజాగా గురువారం ఉదయం భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారంతో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపయ్యింది. కోనసీమలోని గోదావరి నది పాయలైన గౌతమి, వశిష్టస వైనతేయలు నిండుగా ప్రవహిస్తున్నాయి. పి గన్నవరం పాత కొత్త అక్విడెక్ట్​ల మధ్య వైనతేయ, గోదావరిలో ప్రవాహం జలకళను సంతరించుకుని కనువిందు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details