ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 6, 2020, 12:25 AM IST

ETV Bharat / state

'కొల్లు రవీంద్రపై కేసు పెట్టడం అప్రజాస్వామికం'

తెదేపా నేతలపై అక్రమంగా కేసులు పెట్టడమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని తెదేపా నేత బండారు సత్యనారాయణ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

filing case on kollu ravindra is undemocratic says former mla bandaru satyanarayana murthy
కొల్లు రవీంద్రపై కేసు పెట్టడం అప్రజాస్వామికమన్న బండారు సత్యనారాయణ మూర్తి

తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. తెదేపా నేతలపై అక్రమంగా కేసులు పెట్టడమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వపాలనను విమర్శించినందుకు కొల్లు రవీంద్రపై కేసు పెట్టడం అప్రజాస్వామికమని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ధ్వజమెత్తారు. బలమైన బీసీ నాయకత్వాన్ని అణిచివేయడమే లక్ష్యంగా... ప్రభుత్వం కేసులు పెడుతూ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details