ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 16, 2020, 2:57 PM IST

Updated : Jul 16, 2020, 4:36 PM IST

ETV Bharat / state

అప్పలు బాధ తాళలేక తండ్రి కొడుకులు ఆత్మహత్యాయత్నం.. తండ్రి మృతి

అప్పల బాధ తాళలేక రావులపాలెంలో తండ్రి కొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గౌతమి గోదావరి వంతెన వద్ద వీరు అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తండ్రి ఆంజనేయరెడ్డి మరణించినట్లు గుర్తించారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీఐ తెలిపారు.

father and son make suicide in ravulapalem because of debt problems
రావులపాలెం గౌతమీ గోదావరి వంతెన వద్ద తండ్రి కొడుకులు ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అప్పుల బాధ తాళలేక తండ్రి కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆదిలక్ష్మి నగర్​లో నివాసముంటున్న కర్రి ఆంజనేయ రెడ్డి (55), అతని కుమారుడు మోహన్​ లక్ష్మణ్​ రెడ్డి.. స్థానిక గౌతమి గోదావరి వంతెన మీద ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతం వద్ద ఆంజనేయ రెడ్డి మృతి చెందగా.... కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు.

Last Updated : Jul 16, 2020, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details