ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్రపుడెక్కతో పంట కాలువలకు చేరని నీరు

ముమ్మిడివరం నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తుంటారు. ఆ మెత్తానికి పంట కాలువల ద్వారా వచ్చే నీరే దిక్కు. నాలుగు మండలాల్లో 45 కిలోమీటర్ల మేర బ్రాంచ్ కాలువలు ఉన్నాయి. అందులో మొత్తం గుర్రపు డెక్క పేరుకుపోవటంతో రైతులకు నీరందక అవస్థలు పడుతున్నారు.

By

Published : Jul 1, 2019, 1:00 PM IST

వరిసాగుకు గుర్రపుడెక్క అడ్డు-తొలగించండి

వరిసాగుకు గుర్రపుడెక్క అడ్డు-తొలగించండి

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. దీనికి పంట కాలువ ద్వారానే నీరు అందవలసి ఉంది. ఈ నాలుగు మండలాలలో 45 కిలోమీటర్ల మేర బ్రాంచ్ కాలువలు ఉన్నాయి. ప్రతి ఏటా 'నీరు-చెట్టు' కార్యక్రమం ద్వారా వేసవిలో ఉపాధి కూలీల ద్వారా పంట కాలువలో పూడికతీత తీసి.. చెత్తను తొలగించి ఖరీఫ్ సీజన్ నాటికి నీరందేలా చేసేవారు. ఈ ఏడాది ఎన్నికల వల్ల ఈ పనులు చేపట్టకపోవడంతో పంట కాలువలన్నీ గుర్రపుడెక్క, ఇతర వ్యర్ధాలతోనిండిపోయాయి. కాలువలకు నీరు వదిలి నెల గడుస్తున్నా రైతు చేనుకు నీరు అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలోని పూడికను.. గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ నెలలో అధిక వర్షాలతో గోదావరి నది పాయలకు వరదలు సంభవించే అవకాశం ఉన్నందునా.. అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details