ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

4 ఎకరాల్లోని దిగుబడి ధాన్యం మొత్తం పేదలకు దానం! - తూర్పుగోదావరి జిల్లాలో పండించిన పంటను దానం చేస్తున్న రైతు

అన్నదాతా సుఖీభవ అంటూ.. ఆ రైతును అంతా ఆశీర్వదిస్తున్నారు. కలకాలం సుఖంగా వర్ధిల్లాలని ఆ గ్రామ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడంటే..! తాను నాలుగు ఎకరాల్లో పండించిన మొత్తం ధాన్యాన్ని బియ్యంగా మార్చి పేదలకు పంచి పెడుతున్నాడు.

farmer helps
farmer helps

By

Published : Jul 18, 2020, 11:25 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామానికి చెందిన రైతు దళే సూరిబాబు.. తన నాలుగు ఎకరాల భూమిలో పండిన ధాన్యాన్ని పూర్తిగా పేదలకు పంచాడు. కరోనా సృష్టిస్తున్న కష్ట కాలంలో.. తన మండలంలోని పేదలకు సహాయం చేయాలని భావించాడు. పొలంలో పండిన 100 బస్తాల ధాన్యాన్ని బియ్యంగా మార్చాడు. మండలంలో వివిధ గ్రామాల పేద ప్రజలుకు అందించాలి అనుకొన్నాడు.

అనుకున్నదే తడవుగా... పి.జగనాధపురం గ్రామానికి చెందిన 100 పేద కుటుంబాలకు ఈ రోజు 25 కేజీల బియ్యం చొప్పున పంచాడు. పేద శంకర్లపూడి గ్రామానికి చెందిన ఆ రైతు.. తన తోడబుట్టిన వారి సహకారంతో... స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంతటి దాతృత్వం చేసిన రైతు సూరిబాబును, వారి కుటుంబ సభ్యులను తహసీల్దార్ గోపాలకృష్ణతో పాటు.. సాయం అందుకున్న వారు, స్థానికులు మనస్ఫూర్తిగా అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details