తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో దుకాణాలను రాత్రి 7 గంటల వరకు తెరుచుకునేందుకు అమలాపురం ఆర్టీవో అనుమతిచ్చారు. ఇప్పటివరకూ..ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ.. రాత్రి ఏడు గంటల వరకు దుకాణాలు తెరుచుకునేలా ఆర్డిఓ అనుమతించారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు.