ఆత్రేయ పాటల భావుకతను ఆరాధించే ఓ అధ్యాపకుడు.. ఆయన సాహిత్యాన్ని భద్రంగా నేటి తరాలకు అందించేందుకు అలుపెరుగని కృషి చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నివసించే విశ్రాంత తెలుగు అధ్యాపకుడు పైడిపాల.. 1989లోనే ఆత్రేయ సాహితీ పేరిట మహత్తర సంకల్పానికి శ్రీకారం చుట్టారు. అలనాటి నటుడు జగ్గయ్య మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరించగా.. పైడిపాల సహ సంపాదకుడిగా ఆత్రేయ రచనా సర్వస్వాన్ని 7 సంపుటాలుగా వెలువరించారు. నాడు ఆయా రచనలకు సినీ ప్రేక్షక లోకం, ఆత్రేయ అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించింది. మొదటి 3 సంపుటాలలో ఆత్రేయ నాటక సాహిత్యం, తరువాత 3 సంపుటాలలో 1092 సినీ పాటలు, ఏడో సంపుటిలో కదంబం పేరిట ఆత్మకథ రచించారు.
ఇదీ చదవండి:72 శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే..