ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీ నిధులు పక్కదారి.. 'దళిత సింహగర్జన'తో కళ్లు తెరిపిద్దాం: హర్ష కుమార్

Harshakumar on YSRCP: వైకాపా ప్రభుత్వం మూడేళ్లలో ఎస్సీలను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ వేరే పథకాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. పది లక్షల మందితో దళిత సింహగర్జన నిర్వహించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు.

By

Published : Jul 5, 2022, 5:04 PM IST

హర్ష కుమార్
హర్ష కుమార్

Harshakumar on SC subplan funds: ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ వేరే పథకాలకు వినియోగిస్తున్నారని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆరోపించారు. అది పచ్చి మోసమని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం మూడేళ్లలో ఎస్సీలను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని.. జగన్ సర్కార్ మోసాన్ని ఎవరూ మర్చిపోకూడదని అన్నారు. జగన్ వైఖరిని ఎండగట్టేందుకు దళిత సింహగర్జన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందుకు మేధావులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. పది లక్షల మందితో దళిత సింహగర్జన నిర్వహించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని హర్ష కుమార్ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details