ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్పీ గారు... అతన్ని ఎన్​కౌంటర్ చేసేయండి: హర్షకుమార్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి కుటుంబసభ్యులను మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత హర్షకుమార్ పరామర్శించారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

By

Published : Nov 30, 2020, 10:47 PM IST

ex mp harsha kumar
ex mp harsha kumar

మీడియా సమావేశంలో హర్షకుమార్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎన్​కౌంటర్ చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు హర్షకుమార్ జిల్లా ఎస్పీని కోరారు. సభ్య సమాజం సిగ్గు పడేలా ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్​లో బాలిక కుటుంబ సభ్యులను హర్షకుమార్ సోమవారం పరామర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details