ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సురక్షిత మంచినీటి పథకం ఒప్పంద కార్మికుల దీక్ష - కార్మికుల దీక్షకు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మద్దతు

తూర్పుగోదావరి జిల్లా భావవరంలో సురక్షిత మంచినీటి పథకం ఒప్పంద కార్మికులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని... జగ్గంపేట మాజీఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సందర్శించి మద్దతు ప్రకటించారు. రాజకీయ కక్షతో ఐదుగురిని తొలగించడం దారుణమని, తెదేపా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

jyothula-nehru-support-safe-drinking-water-scheme-contract-workers
సురక్షిత మంచినీటి పథకం ఒప్పంద కార్మికుల దీక్ష

By

Published : Dec 4, 2019, 9:04 PM IST

సురక్షిత మంచినీటి పథకం ఒప్పంద కార్మికుల దీక్ష

జగ్గంపేట మండలం భావవరం గ్రామంలో సురక్షిత మంచినీటి పథకంలో పదేళ్లుగా ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న వారిని... తొలగించడం అన్యాయమని జగ్గంపేట మాజీఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. బావవరంలో ఒప్పంద కార్మికులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. మూడు రోజుల నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల డిమాండ్​లు నెరవేర్చాలని ప్రభుత్వన్ని కోరారు. రాజకీయ కక్షతో ఐదుగురిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. తిరిగి ఉద్యోగాలు ఇచ్చే వరకూ తెదేపా వారికి అండగా ఉంటుందని హామీఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details