కరోనాపై పోలీసులు వి'చిత్ర' ప్రచారం
కరోనాపై పోలీసుల వి'చిత్ర' ప్రచారం - ఏపీలో కరోనా వైరస్
కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఏలేశ్వరం బాలాజీ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై కరోనా వైరస్ చిత్రాన్ని గీయించారు. 'నా దగ్గరకు రాకండి... ఇంట్లోనే ఉండండి' అంటూ దానిపై సందేశాన్ని రాయించారు. అలాగే భారతదేశం చిత్ర పటాన్ని గీయించి మీ కోసం... మనకోసం.. మనందరి కోసం ఇంట్లోనే ఉండండి అని రాయించారు. ఈ చిత్రాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
![కరోనాపై పోలీసుల వి'చిత్ర' ప్రచారం eleshwaram police are educating the public on the corona with the paintings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6714681-70-6714681-1586356367675.jpg)
eleshwaram police are educating the public on the corona with the paintings