ETV Bharat / state
కాకినాడలో విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభం - కాకినాడలో విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను కలెక్టర్ మురళీధర్రెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని 33 మండలాల నుంచి 254 ప్రాజెక్టులను ఈ ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, ఐ.వెంకటేశ్వరరావు, మేయర్ సుంకరపావని తదితరులు పాల్గొన్నారు.