ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మావోయిస్టుల కట్టడికి ప్రత్యేక బలగాల మోహరింపు' - తూర్పుగోదావరి ఎస్పీ నయీం అస్మీ మీడియా సమావేశం

ఛత్తీస్​గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టుల ప్రభావం.. రాష్ట్రంలోని గ్రామాలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. ప్రత్యేక బలగాలను మోహరించి.. నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

east godavari sp press meet on security arrangements for elections
ఎన్నికల భద్రతా చర్యలపై తూర్పు గోదావరి ఎస్పీ మీడయా సమావేశం

By

Published : Feb 7, 2021, 3:51 PM IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండగా.. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని తూర్పుగోదావరి ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. కాకినాడలోని ఎదుగురాళ్లపల్లి, తుమ్మల, చట్టి పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.

పక్కనే ఉన్న ఛత్తీస్​గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టుల ప్రభావం మన గ్రామాలపై పడకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ చెప్పారు. వారు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడకుండా.. ప్రత్యేక బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశామని వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details