ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 26, 2021, 7:15 PM IST

ETV Bharat / state

'మావోయిస్టులు లొంగిపోతే సరైన వైద్యం అందిస్తాం'

కరోనాతో కొంతమంది మావోయిస్టులు(Maoist) చనిపోయారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి(SP Nayeem Asmi) తెలిపారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోతే సరైన వైద్యం అందిస్తామని వెల్లడించారు.

East Godavari District SP Nayeem asmi
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి

కరోనా(corona)తో ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు(maoist) చనిపోయారని, వైద్యం అందక మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తూర్పుగోదావరి ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి(SP NayeemAsmi) తెలిపారు. కరోనా లక్షణాలు కలిగిన మావోయిస్టులు లొంగిపోతే సరైన వైద్యం అందించి పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కొవిడ్​తో పలువురు మావోయిస్టులు మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ అంశంపై నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details