ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజమండ్రిలోని పొగాకు పరిశోధన స్థానాన్ని విస్తరింపజేయాలి' - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్​ను అమలాపురం ఎంపీ చింతా అనురాధ కలిశారు. రాజమండ్రిలోని పొగాకు పరిశోధన స్థానాన్ని విస్తరింపజేయాలని కోరారు. బహుళ పంటల పరిశోధన స్థానంగా తిర్చిదిద్దాలని వినతిపత్రం అందజేశారు.

MP Chinta Anuradha
ఎంపీ చింతా అనురాధ

By

Published : Feb 6, 2021, 7:41 PM IST

రాజమండ్రిలోని పొగాకు పరిశోధన స్థానాన్ని విస్తరింపజేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ వినతి పత్రం అందజేశారు. జాతీయస్థాయి గుర్తింపు పొందిన పొగాకు పరిశోధన స్థానాన్ని బహుళ పంటల పరిశోధన స్థానంగా తిర్చిదిద్దాలని కోరారు. ఈ మేరకు ఆమె దిల్లీలోని మంత్రి నరేంద్రసింగ్ తోమర్​ను కలిశారు. పొగాకు పరిశోధనా స్థానం మెరుగైన పంటల అభివృద్ధికి ఉపయోగపడుతుందని వివరించారు. తన విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details