ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయినవిల్లి వినాయకుడి దర్శనం.. ఇప్పట్లో లేనట్లే! - east godavari dst temples opening news

లాక్ డౌన్ అనంతరం ఈ నెల 8 నుంచి ఆలయాల్లో భక్తులకు ప్రవేశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కానీ.. రెడ్ జోన్ పరిధిలోని ఆలయాలు తెరిచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లిలోని సిద్ధి వినాయకుడి ఆలయంలో.. దర్శనాల ప్రారంభానికి ఈ నిబంధన అడ్డు పడింది.

east godavai dst inapalli ganesh temple not open after lockdown also due to it comes under redzone
east godavai dst inapalli ganesh temple not open after lockdown also due to it comes under redzone

By

Published : Jun 7, 2020, 6:38 PM IST

సుదీర్ఘ లాక్​డౌన్ అనంతరం ఈ నెల 8 నుంచి దేవస్థానాల్లోకి భక్తులను అనుమతించే విధంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ.. రెడ్ జోన్ లో ఉన్న కారణంగా తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లిలోని సిద్ధి వినాయకుడి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం కల్పించటం లేదు.

అయినవిల్లి మండలం మొత్తం మీద 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా.. ఈ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తరవాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆలయ కార్యనిర్వహణాధికారి తారకేశ్వర రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details