తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వేలాది కార్మికులు తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక సతమతం అవుతున్నారు. చారిటబుల్ ట్రస్ట్ వాళ్లు ఇచ్చే నిత్యావసర సరుకులు, కూరగాయలు తమదాకా వచ్చే లోపే అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పరిస్థతిని మా ప్రతినిధి అందిస్తారు.
సాయం కోసం పడిగాపులు.. తిండి కోసం కష్టాలు - @corona ap cases
లాక్డౌన్ కారణంగా రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల పరస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ సరుకులు పట్టుపని 10 రోజులైన సరిపోలేదు. ఇంట్లో జనాభా ఎక్కువ. ఇచ్చే సరకు తక్కువ. విధి లేని పరిస్థితుల్లో.. దాతల సహాయం కోసం ఇలాంటి ఎంతో మంది ఎదురుచూడాల్సి వస్తోంది.
రాజమహేంద్రవరంలో పేదల కష్టాలు