ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2020, 6:25 PM IST

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో హ్యాండ్​వాష్ ట్యాంక్​లు ఏర్పాటు

రాజమహేంద్రవరం నగరంలోని దేవీచౌక్​లో మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్​రాం హ్యాండ్​వాష్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ప్రజలు పరిశుభ్రతను పాటించి... కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

due to corona lockdown Establishment of Hand Wash Tanks in Rajahmundry in east godavari
due to corona lockdown Establishment of Hand Wash Tanks in Rajahmundry in east godavari

కరోనాను నియంత్రించేందుకు పరిశుభ్రతతో మెలగాలని మంత్రి తానేటి వనిత సూచించారు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం ద్వారా మహమ్మారి నుంచి బయటపడొచ్చని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌రాం ఏర్పాటు చేసిన హ్యాండ్‌వాష్‌ ట్యాంకులను దేవీచౌక్‌లో ప్రారంభించారు. ఇలాంటివి మరో ఆరుచోట్ల.. ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఎంపీ తెలిపారు. ప్రజలు పరిశుభ్రంగా ఉండి కరోనాని జయించాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details