ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇలా చేస్తే ప్రజలకు నమ్మకం పోతుంది'

మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ శాసనసభ పర్నిచర్​ను సొంతానికి తీసుకెళ్లడం సమంజసం కాదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.

By

Published : Aug 23, 2019, 6:16 PM IST

కోనా రఘుపతి

కోన రఘుపతి

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు శాసనసభ ఫర్నిచర్​ను సొంతానికి తీసుకెళ్లడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఉపసభాపతి కోన రఘుపతి విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ఆయన వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా...ముఖ్యమంత్రి జగన్ సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. కొన్ని సంస్కరణల కోసం ఆదర్శవంతమైన చట్టాలను తీసుకురావటం అభినందనీయమన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details