ఇంటి వద్దనే వైఎస్ఆర్ పింఛన్ పంపిణీ - ఇంటివద్దకే వైఎస్ఆర్ పింఛన్ పంపిణీ
పింఛను లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్దనే అందిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. లబ్ధిదారుల నుంచి ఏమి అశించకుండా..డబ్బులు అందించాలని ఎమ్యెల్యే చిట్టిబాబు స్పష్టం చేశారు. కొత్తగా పింఛన్లు మంజూరు అయినవారికి ఆయన పంపిణీ చేశారు. గ్రామ వాలంటీర్ల ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు ఇచ్చిన డబ్బులు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి.