తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు స్థానిక తెదేపా నాయకులు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాలని దాత జ్యోతుల నెహ్రూ అన్నారు.
పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ - lockdown effect on people
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
![పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ Distribution of vegetables and eggs to the poor in Ramavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6759004-1050-6759004-1586665543137.jpg)
రామవరంలో పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ