ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో వంద రూపాయలకే పండ్ల కిట్ - Distribution of fruit kit at kakinada

లాక్​డౌన్ అమలవుతున్న తరుణంలో ప్రజలకు పోషకాహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. వంద రూపాయలకే వివిధ రకాల పండ్ల కిట్‌ను అందించే కార్యక్రమాన్ని ఆయన కాకినాడలో ప్రారంభించారు.

Distribution of fruit kit for one hundred rupees at kakinada
పండ్ల కిట్​ను అందిస్తున్న కలెక్టర్

By

Published : Apr 21, 2020, 7:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉద్యానశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో వంద రూపాయలకే వివిధ రకాల పండ్ల కిట్​ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కొవిడ్ ప్రత్యేకాధికారి కాంతిలాల్​దండే, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. లాక్​డౌన్ కారణంగా అరటి, ఇతర పండ్ల రైతులు అమ్మకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని... ఈ కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. జిల్లాలో మంగళవారం మాస్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ చేతుల మీదుగా మాస్కులను పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:'అడవి జంతువులకు ఆహారం వేస్తే ఎంతో ప్రమాదం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details