తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో కరోనా కారణంగా మార్చి 20 నుంచి దర్శనాలతో పాటు అన్ని సేవలు ఆపేశారు. ఇటీవల భక్తులను స్వామి దర్శనానికి అనుమతించి వివిధ సేవలను తిరిగి ప్రారంభించారు. అయితే సహస్ర దీపాలంకరణ సేవపై దృష్టి సారించలేదు. ఈ విషయంలో వైదిక బృందం, అధికారుల మధ్య భిన్న వాదనలు ఉన్నట్లు సమాచారం. వారం లేదా పది రోజులకు ఒకసారైనా సేవ నిర్వహించాలని చర్చిస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు.
అన్నవరంలో సహస్ర దీపాలంకరణ సేవ పునః ప్రారంభంపై చర్చలు - annavaram temple news
కరోనా కారణంగా మూతపడిన ఆలయాలు దర్శనాలకు అనుమతించాయి. కానీ మునుపటిలా అన్నీ కార్యక్రమాలు నిర్వహించట్లేదు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవ పునఃప్రారంభించే విషయంలో మీమాంస నెలకొంది.
![అన్నవరంలో సహస్ర దీపాలంకరణ సేవ పునః ప్రారంభంపై చర్చలు sahasra deepalankarana seva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9437808-372-9437808-1604559378694.jpg)
సహస్ర దీపాలంకరణ సేవ పాతచిత్రం
తిరుపతిలో మాదిరిగా అన్నవరంలో సహస్ర దీపాలంకరణ సేవను 2017లో ప్రారంభించారు. అప్పటి ధర్మకర్తల మండలి సభ్యుడు మట్టే సత్య ప్రసాద్ 1058 దీపాలు వెలిగేలా ప్రత్యేకంగా మందిరాన్ని, మండపాన్ని నిర్మించారు. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు తూర్పు రాజగోపురం వద్ద మందిరంలో సేవ నిర్వహించేవారు.
ఇదీ చదవండి: వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ