బోటు వెలికితీతకు ముమ్మర ప్రయత్నాలు - boat accident at kachuluru
గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో బోటును ఒడ్డుకు చేరుస్తామని బృందం తెలిపింది.

బోటు ప్రమాదం
బోటును వెలికితీతకు ముమ్మర ప్రయత్నాలు
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు వెలికితీత పనులు నేడూ కొనసాగనున్నాయి. గోదావరిలో మునిగిన పర్యాటక బోటు వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం అనేక ప్రయత్నాలు చేస్తోంది. నిన్న లంగర్ సాయంతో బోటు రెయిలింగ్ను బయటకు తీశారు. వాతావరణం సహకరిస్తే మరో రెండు, మూడు రోజుల్లో ఒడ్డుకు చేరుస్తామని సత్యం బృందం తెలిపింది. కాకినాడ నుంచి వచ్చిన అధికారి కెప్టెన్ ఆదినారాయణ బోటు వెలికితీత పనులను పర్యవేక్షిస్తున్నారు.